Posts

Showing posts from September, 2020
Image
హిందూ ఆధ్యాత్మిక వేది మానవ జీవిత లక్ష్యం ఏమిటి ? ఆత్మ జ్ఞానం విలువైనదే గాని అంత సులువైనది కాదు. ఇట్టి జ్ఞానాన్ని పొందటానికి ఒక్క మానవ జన్మ మాత్రమే అర్హమైనది. జంతువులు గాని, చెట్లు గాని, దేవతలు గాని ఆత్మ జ్ఞానాన్ని పొందే హక్కు లేదు. కర్మ చేయటానికి అధికారం మానవులకు మాత్రమే ఉన్నది. అలాగని మానవులందరూ తమ జన్మలను ఆత్మాను భూతికి ఉపయోగించు కుంటారా ? అంటే లేదు. ఎందుకంటే  : 1. ఆత్మాను భూతిని పొందాలని, అదే మానవ జీవిత పరమ లక్ష్యమని ముందు తెలియాలి. 2. ఆత్మాను భూతి ని పొందాలనే పట్టుదల కలగాలి. 3. పొందే విధానం తెలుసుకోవాలి. 4. పొందటానికి ఆటంకంగా ఉన్న దోషాలను తొలగించు కోవాలి. 5. మార్గం చూపే సద్గురువు లభించాలి. 6. ఆయన చూపిన మార్గంలో పట్టుదలగా ప్రయాణించాలి. అందుకే లోకంలో ఈ జ్ఞానాన్ని పొందేవారు అరుదుగా ఉంటారని భగవానుడు తెలియ జేస్తున్నాడు. పిల్లి తన కూనలను కళ్ళు తెరిచే లోపల తట్టలలో, బుట్టలలో, గాదెలలో, గంపలలో మారుస్తుందట. అలా ఏడు చోట్ల మారుస్తుందంటారు. అలాగే 'మాయ' అనే పెద్ద పిల్లి ఈ జీవులను కళ్ళు తెరిచే లోపల ఎన్ని చోట్ల మార్చింది ? 83 లక్షల 99వేల 999 గాదెలలో, గంపలలో, వివిధ గర్భ కోశాలలో చేర్చింది. మా...
Image
ఆదర్శ హిందూ గృహం ఆదర్శ హిందూ గృహం ఎలావుండాలి ? 1.  ఇంటి పై ఓంకార చిహ్నముండాలి. 2. ఇంటి పై కాషాయ ధ్వజం ఎగరాలి.  3. ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజు సేవించాలి.   4. ఇంట్లో దేవతల, మహనీయుల చిత్ర పటములు మాత్రమే ఉండాలి.   5. ఇంటి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు వ్యవస్థితంగా ఉండాలి.   6. ఇంటి లో శుద్ధ త్రాగునీటి వ్యవస్థ, మురుగునీరు పోవుటకు వ్యవస్థ పుండాలి.   7. ఇంటి ఆవరణ లో ఆకు కూరలు, కూరగాయలు మరియు వేప వంటి   నీడ మొక్కల పెంపకము జరగాలి.   8. ఇంటి వారంతా ప్రాతః కాలం లేచుట, వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని వ్యాయామం, యోగ చేయాలి. సూర్యోదయం అయిన తరువాత సూర్యునికి నమస్కరించడం. పిల్లలు ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు పాఠ్య పుస్తకాలు చదువు కుంటే బాగా జ్ఞాపకముంటుంది ఇందుకోసం రాత్రి త్వరగా పడుకోవాలి. పెద్దలు అచరణ ద్వారా పిల్లలకు ఈ విషయాలు నేర్పుట.   9. ప్రతి నిత్యము స్నానము, కుంకుమ ధారణ, దేవునికి నమస్కరించుట, కలిగి ప్రార్ధించుట, అందరి క్షేమము, దేశ క్షేమము కాంక్షించుట.   10. కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసుకొనుట....
Image
5  సంఖ్య - విశేషాలు పంచ మన్మథుని బాణాలు :  అరవిందం = తామర పువ్వు, అశోకం = అశోకవృక్షం పువ్వు, చూతం = మామిడి పువ్వు, నవమల్లిక = అప్పుడే విరిసిన మల్లె పువ్వు, నీలోత్పలం = నల్ల కలువ పంచ-ఉపవిఘ్నములు :  (యోగమునకు కలుగు ఉపవిఘ్నములు) 1. దుఃఖము, 2. దౌర్మనస్యము, 3. అంగమేజయత్వము, 4. శ్వాసము, 5. ప్రశ్వాసము. "దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసా విక్షేపసహభువః" [పాతంజలయోగసూత్రములు 1-31] పంచ లోహాలు  : వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి పంచ జ్ఞానేంద్రియాలు : శ్రోత్రం (చెవులు), త్వక్కు (చర్మం), చక్షు (కళ్లు), జిహ్వ (నాలుక), ఘ్రాణం (ముక్కు) పంచ కర్మేంద్రియాలు : వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ పంచ కర్మలు:  తర్కశాస్త్రంలో: ఉక్షేపణం, అవక్షేపణం, అకుంచనం, ప్రసారణం, గమనం ;  వైద్యశాస్త్రంలో: వమనం, రేచనం, నస్యం, అనునాసనం, నిరూహం పంచ విషయాలు : శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు పంచ ప్రాణాలు : ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము పంచ పాండవులు : ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పంచ భూతాలు : భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని పంచ లింగాలు : పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం,...
Image
శ్రీ కృష్ణుడు కృష్ణుడు మన తార్కిక పొరల్లో అమరని, కొలమానాల్లో ఇమడని మహాత్ముడు. కృష్ణుడికి ఆలయాలు నిర్మించాము. పూజలు చేస్తున్నాము. భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నాము. "హరే రామ హరే కృష్ణ" మహామంత్రాన్ని నిరంతరం జపించుకొనే వాళ్ళమూ ఉన్నాము. అంటే అనుక్షణం ఆ మాహాత్ముడిని మన స్మృతి పథంలో నిలిపి ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నాం. “కృష్ణుడు” అనే శబ్దం వినగానే స్ఫురించేది ఏమిటి ? భగవద్గీత, పదహారువేల మంది గోపికలతో బృందావన రాసలీలలు, యశోదమ్మ వద్ద చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలు, రాధమ్మతో ప్రణయలహరి, సత్యభామాది అష్టసఖులు ఇంకా ఎన్నో... కానీ, ఒక్క క్షణం యోచించండి. కృష్ణుని గురించి మనకున్న అవగాహనతో కృష్ణుడిలాంటి ఒక వ్యక్తి దేహధారిగా మనతో సహజీవనం చేయడానికి వస్తే, అంగీకరించి, ఆదరించి, అభిమానించే వాళ్ళం ఎంతమందిమి? పైకి అంగీకరించినా, అంతరాంతరాల్లో మింగుడు పడని ప్రశ్నే అవుతాడు కృష్ణుడు. ఎప్పుడో ఐదు వేల సంవత్సరాలనాడు ఉండి, పోయిన కృష్ణుణ్ణి, మన తాత, తండ్రులు చెప్పారని పూజించటం, కృష్ణ తత్వం పట్ల ఎట్టి అవగాహన పెంచుకోకుండా, గొర్రెదాటు మనస్తత్వంతో తరాలు సాగిపోవటం సమర్ధనీయమా? ఒక వ్యక్తిగా కూడా అంగీకరించగలమో, లేదో త...
Image
పాలు చేసిన తపస్సు   (ఒక చిన్న కథ) ఒకసారి "పాలు" తపస్సు చేసిందట - దేవుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అన్నాడట - అప్పుడు "పాలు" ఇలా చెప్పిందట. దేవుడా నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగానే ఉంటాను. అయితే ఈ పాపిష్టి మానవుడు నాకు పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఓ నవ్వు నవ్వి "ఓ పాలు" ఇది విను నీవు "పాలలా" జీవించాలి అని ఆశ పడే ముందు ఈ మాటలు విను నీవు పాలలాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు పాలకు పెరుగు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు పెరుగుని చిలికితే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు మజ్జిగ లోంచి వచ్చిన వెన్న అయితే వారాలు వారాలు అయినా ఏమీ కాదు. వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో చాలా రోజులు ఉంటావు. అలాగే మందులకు వాడుతారు, ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు వెలుగువవుతావు.... ఇప్పుడు చెప్పు ఒకరోజు పాలగా ఉండి "పాలలాగానే" చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు వెలుగువవుతావా అని దేవుడు ప్రశ్నించాడు.... దేవుని మాటకి "పాలు" మూగవ...
Image
సన్మార్గం జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం.  తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం.  సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు. ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి.  సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి. మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి.  ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు. సత్‌ కార్యాలు చేస్తూ ము...
Image
గాయత్రి మంత్రము న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.  గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు.  'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం.  కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.  వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు. ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్. కామ గాయత్రి - ఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్. కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుద...
Image
గోధూళికా ముహూర్తము       సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోధూళికా ముహూర్తమని అనబడును. విపులంగా చెప్పాలి అని అంటే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి . ఉదయాన్నే ఊరి బయటకు మేత కొరకు పశువులను తోలుకు పోయేవారు. తిరిగి సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు . అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది . అలాంటి సమయమును గోధూళికా ముహూర్తముగా వివరించితిరి . క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4.30 ని.ల నుండి సుమారు 6 గంటల వరకు ఈ సమయము ఉండును. దీనినే గోధూళికా ముహూర్తము అని అంటారు . ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును . వర్జ్యము , దుర్మూహర్తములతో పనిలేదు. హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్య" అని కూడా వ్యవహరిస్తారు. పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం.  సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య. ఈ సమయంలో శుచి, శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి. భోజనం చేయడం, నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. కైలాసమందలి ప్రమథ గణములు,...
Image
ఆచమనం పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట  చాలా సార్లు వింటాం.  కానీ ఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు. అందుకే ''ఆచమనం'' అంటే ఏమిటో,   దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. "ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది.  ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు,  భోజనానికి ముందు, తర్వాత,   బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత  ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత  ఆచమనం చేయొచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా,శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు.  అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని  (ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు)  పోసి, వాటిని తాగాలి.  చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ,   తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు.. బా...
Image
జపానికి 108 సంఖ్యే ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి ? మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్యను ఉపయోగిస్తుంటాము. ఇది మనం పెద్దలు చెప్పారని ఆచరిస్తున్నాము.అసలు ఈ 108 సంఖ్యకు అంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాం కాని ఎప్పుడైన ఆలోచించారా,ఆ విషయం గురించి ఎవరి ద్వార నైన తెలుసుకోవాలని ప్రయత్నం కూడ చేయలేదు అందుకే ఆ సంఖ్య యొక్క ప్రాదాన్యతను మీకు వివరిస్తున్నాం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో 108 శ్లోకాలు, అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను ఆరాధిస్తాము. ఇందుకు ప్రదానమైన కారణం మన భారతదేశ ఋషిపుంగవుల అనేక వేల సంవత్సరాల వారి పరిశోధనలో తెల్చిచెప్పిన జ్యోతిషానికి సంబంధించి మనకు ఉపయోగ పడేవి 27 నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అనగా నక్షత్రాలు వాటి పాదాలు కలిపితే 27 x 4 = 108 అవుతుంది. ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఏదో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత.కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము. ఖగోళ పరంగాసూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని సూర్యుని చుట్టు కొలత 1391000kms తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమ...

మనసు - మాయ

Image
మనసు - మాయ తుమ్మెద  పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది.. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది.. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు,  ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి.... అయ్యో నన్ను ఏదో  బంధించేసింది అని చెప్పేసి ఆ తామర  రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది.... అయితే  మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేెకులను తొలచలేదా.. ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..  గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి... కానీ  అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో... లేక  నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీన పర్చింది.. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత.. నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న  దాన్ని నమ్మింది...  అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది... మన జీవితంలో సమస్యలూ అంతే, సమస్య బలమైంది కాదు.. మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం... మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,  గుర్తించడమే, నమ్మడమే దాని బలం... "మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు... దాని బలం తామర ...