అరుణాచల క్షేత్రం
భక్తిని, ముక్తిని ప్రసాదించే అరుణాచల క్షేత్రం సృష్టి అంతయూ పంచభూతములచే జనించి, అంతిమంగా వాటిలోనే లీనమువుతుంది. అందుకే పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశమనే ఈ ఐదింటికీ సనాతన ధర్మంలో పెద్ద పీటవేసారు. అంతేకాక పంచభూతాలకి అధిపతి అయిన పరమేశ్వరుని భక్తితో ఆరాధిస్తారు. నిరాకారుడైన ఆ ఈశ్వరుడు కూడా. పంచభూత లింగాలుగా అవతరించి భక్తులచే పూజలందుకుంటున్నాడు. కోరిన కోరికలను అనుగ్రహిస్తూ మోక్షమార్గం వైపు నడిపిస్తున్నాడు. అరుణాచలం ప్రశస్తి : పంచభూత లింగాల క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. ఈశ్వరానుగ్రహం ఉంటేకానీ ప్రవేశం పొందలేని ప్రదేశం అరుణాచలం. "అరుణ" అంటే "ఎర్రని", "అచలం" అంటే "కొండ"... "అరుణాచలం అంటే ఎర్రనికొండ" అని అర్థం. తిరువణ్ణామలైగా పిలువబడే ఈ శైవక్షేత్రం పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పరమశివుడు పంచభూత లింగాలలో ఒకటైన "అగ్ని లింగంగా దర్శనమిస్తాడు. మిగిలినవి కంచిలో పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగంగా పరమేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు". పురాణాలలో కొనియాడబడిన అరుణా...