Posts

Showing posts from December, 2020
Image
పసుపు కొన్ని వేల సం. క్రితం నుండే మన పూర్వీకులు.. గుడిలో పులిహోర లో పసుపు.. పెళ్లికి అక్షింతలలో పసుపు.. స్త్రీ ముఖరవిందానికి పసుపు.. ఇలా.. ఎందుకు పసుపు ని అంతలా వాడి వుంటారు..?? పసుపు శుభం అంటారు, ఎందుకంటే పసుపు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పసుపు వల్ల లాభాలు : 1. పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది. 2. సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. 3. పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని, పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి. 4. వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి. 5. పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి. 6. వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాల...
Image
 ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునే వారు దశమి రోజునుంచే కొన్ని తప్పని సరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలై నిషేధిత పదార్థాలు ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవద్గీత/భాగవతము పఠనం చేయాలి లేదా పురోహితుడు చదువుతుంటే మీరు వినాలి. " ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశాక్షరిమంత్రాన్ని కానీ లేదా  "ఓం నమో నారాయణాయ"   అష్టాక్షరీ మంత్రాన్నీ మంత్రాన్ని  జపించాలి.   రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు సహస్రనామాలను పారాయణ చేయాలి.  దేవుడిని దర్శించుకోవాలి.  ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు.  ఎక్కువగా మాట్లాడకూడదు.  ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజు వీలైనంత ఎక్కువగా దాన, ధర్మాలు చేయాలి. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకూడదు.  శ్రీమద్భాగవతం ప్రకారము విష్ణుభక్తులు ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలి.  త్రయోదశి వచ్చే ముందే వ్రతాన్ని పూర్తి చేసి ...