🚩  శివాలయాలు - వాటి విశిష్టత



🔰 
శాస్త్రవేత్తలకే అర్థంకాని శివాలయాలు


🔰 మహానంది 

శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. 

బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది.

ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.


🔰 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )

కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.


🔰 ఆదిలాబాద్ జిల్లాలోని  శ్రీ బుగ్గా రామేశ్వరాలయం. 

ఈఅలయంలో  శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.


🔰 కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో  నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్


🔰 అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.


🔰 వరంగల్ జిల్లా  వెయ్యిస్తంభాల గుడి

ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.

ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.


🔰 ద్రాక్షారామం ఈ శివలింగం

 పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.


🔰 భీమవరంలో సోమేశ్వరుడు.

ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు


🔰 కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.

ఇక్కడికి కాకులు అసలు రావు


🔰గుటూరు జిల్లా చేజర్ల

ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి . 

లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే  శవంకుళ్లిన వాసన వస్తుంది.

ఉత్తరభాగంలో నీరుపోస్తే  అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.


🔰 బైరవకొన ఇక్కడ కాకులు రావు.

అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.


🔰 యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు


🔰 శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట


🔰 కర్నూలు జిల్లాసంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.

6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.


🔰 శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.


🔰 అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ  స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.


🔰 కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.

ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది.

మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.


🔰 మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది.

నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.


🔰 కంచి

 ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.


🔰 తమిళ నాడు తిరు నాగేశ్వరము 

ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.


🔰 చైనాలో కిన్నెర కైలాసము

ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా,,సాయంత్రం తెలుపుగా,రాత్రి నీలంగా మారుతాడు.


ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ

పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋

విజయవాడ

చరవాణి : 76 984 66 666

Comments

Popular posts from this blog